అమెరికాలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.టెక్సాస్లోని ఏఅండ్ఎం యూనివర్సిటీ-కామర్స్ క్యాంపస్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రైడ్ రాక్ రెసిడెన్స్ హాల్లోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడున్న మహిళలపై కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మహిళలు.. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాల్పుల సమయంలో గదిలో ఉన్న చిన్నారి ఒకరు గాయపడినట్టు యూనివర్సిటీ పోలీస్ చీఫ్ బ్రయన్ వాన్ తెలిపారు. లైసెన్స్ కలిగియున్న వ్యక్తే కాల్పులకు తెగబడ్డాడని, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. కాగా, యూనివర్సిటీలో మొత్తం 1600 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: మోదీ