మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన జీవితంలో ఎన్ని కేసులు ఎదుర్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులు నైతికంగా కోడెలను పతనం చేశాయని, అలాంటి సమయంలో టీడీపీ నేతలు ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అందుకే, ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఆయన మరణించారని అన్నారు. కోడెల మృతికి బాధ్యత వహించాల్సింది ఆయన కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ తప్ప ప్రత్యర్థి రాజకీయపార్టీ కాదని స్పష్టం చేశారు.
కోడెల కుటుంబంపై చంద్రబాబునాయుడుకి నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే, ఆయన వారసులుగా కొడుకుని, కూతురుని ప్రకటించాలని , కోడెల కొడుకు కూతురికి.. ఒకరిని నరసరావుపేట, మరొకరిని సత్తెనపల్లి నుంచి డిక్లేర్ చేయాలని అన్నారు. కేవలం, దొంగనాటకాలు ఆడే పనులు చేయొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్యను పోటీకి ఎలా నిలుపుతారు?: కర్నె ప్రభాకర్