telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మద్యం ధరల పెంపు వెనుక మాఫియా: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణలో మద్యం ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారుపై మద్యం ధరల పెంచడం వెనుక కేఎస్ టీ మాఫియా ఉందన్నారు. కేఎస్ టీ అంటే కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అని అభివర్ణించారు. తెలంగాణలో ఏంచేయాలన్నా ఆరు శాతం కమీషన్ చెల్లించాల్సిందేనని ఆరోపించారు. తాజాగా మద్యం ధరల పెంపు వ్యవహారం ఆషామాషీగా తీసుకున్నది కాదని అన్నారు. మద్యం ధరల పెంపు ఓ పెద్ద కుంభకోణం అని తెలిపారు. ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీల్లో బేరసారాలు జరిపి ఈ ఒప్పందం కుదిర్చారని రేవంత్ ఆరోపించారు.

కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే విక్రయిస్తున్నారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వం గుత్తాధిపత్య ధోరణితో వెళుతోందని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయం కంటే 1000 శాతం అధికంగా ధరలు నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామ కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.

Related posts