telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నిరుద్యోగుల ఓట్ల కోసమే ఈ ప్రకటన…

నిరుద్యోగుల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ ఈ నోటిఫికేషన్ల యొక్క ప్రకటన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓట్లకోసం  నోటిఫికేషన్ డ్రామా కు తెరలేపిండు. బీజేపీ ఆందోళనను ముందే పసిగట్టిన కేసిఆర్ భయపడి నోటిఫికేషన్ అని ప్రకటన చేశారు. నిజంగా నిరుద్యోగుల సమస్యల పై చిత్తశుద్ది ఉంటే అన్నీ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇచ్చి కోర్టుల ద్వారా నోటిఫికేషన్ రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తే నిరుద్యోగుల తడాఖా చూపిస్తాం జాగ్రత్తా అని అన్నారు.నోటిఫికేషన్ ఒక బూటకం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇదో కొత్త నాటకం అని బండి తెలిపారు. దుబ్బాక ,GHMC దెబ్బతో దొరకి 6 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా..? నిరుద్యోగుల కాళ్లుకడిగి నెత్తిన పోసుకున్నా నిన్ను క్షమించరు గుర్తుపెట్టుకో అని పేర్కొన్నారు. మీ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక నిరుద్యోగులు గుర్తు రావడానికి 6 ఏళ్ల సమయం పట్టిందన్నమాట…! రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు ఉన్న గిర్రలు ఊడిపొక తప్పదు… ఇన్నిరోజులు ఫాం హౌస్ లో పక్కేసుకొని పన్న కేసిఆర్ కి దుబ్బాక, GHMC దెబ్బతో సోయి వచ్చినట్టుంది అని పేర్కొన్నారు.

Related posts