తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరేందుకు జనవరి 17న ముహూర్తం ఖరారైంది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్ హోదాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉండగా తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనని తెగేసి చెప్పారు. ప్రొటెం స్పీకర్ ఉన్న సమయంలో అసెంబ్లీలోకి తాను అడుగుపెట్టనని వ్యాఖ్యానించారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మంచిదని సూచించారు.