టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో బీజేపీ ఉంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ అవినీతిపై రెండు పుస్తకాలు వేసిన జగన్..ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అవినీతిని నిరూపించడం చేతకాక రాజధాని తరలించడం ఏంటని కన్నా ప్రశ్నించారు.
విశాఖ భూముల స్కాంపై సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కన్నా ప్రశ్నించారు. దోచుకోవడం కోసమే రాజధాని పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రే వివరాలు వెల్లడించాలన్నారు. ప్రభుత్వం అండదండలతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని కన్నా ఆరోపించారు.