‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మహేష్ బాబు వద్దకు ఒక కథను తీసుకెళ్లారట. ప్రశాంత్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్కు కూడా బాగా నచ్చిందట. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ పట్టుకుని అల్లు అరవింద్ను కలవాలని ప్రశాంత్కు మహేష్ సూచించారని, అరవింద్కు ప్రశాంత్ స్టోరీ నెరేట్ చేయనున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ఈ కథ అల్లు అరవింద్కు కూడా నచ్చితే త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ గతంలో డైరెక్టర్ పరశురాంను ఒక స్టోరీ నెరేట్ చేయడానికి మహేష్ బాబు దగ్గరకి పంపారు. అయితే, పరశురాం చెప్పిన కథ మహేష్కు నచ్చలేదు. దీంతో మహేష్-అరవింద్ కాంబినేషన్ అక్కడే ఆగిపోయింది. అప్పటి నుంచి మహేష్ కోసం అల్లు అరవింద్ ఒక మంచి స్క్రిప్ట్ కోసం అన్వేషణ చేస్తూనే ఉన్నారని సమాచారం.కాబట్టి, సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీసు వద్ద ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మధ్య క్లాష్ రావడం వల్ల మహేష్, అరవింద్ మధ్య స్నేహం చెడిందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారు.