telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సింహాద్రి అప్ప‌న్న స్వామి నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

విశాఖ‌లోని సింహాచలం అప్ప‌న్న స్వామి నిజ‌రూప ద‌ర్శ‌నం వీఐపీలు నుంచి సామాన్య భ‌క్తులు వ‌ర‌కు ఆలయానికి పోటెత్తుతున్నారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొండపైకి కాలినడకన చేరుకున్నారు. ఈ సందర్భంగా  స్వామివారి చందనోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు . అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ..సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు.

తొలిసారి చందనోత్సవంలో న‌ని త‌మిళ‌సై అన్నారు..ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.

 

Related posts