telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా

Kanna laxminarayana

దేశంలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన సీఎం జగన్ ఒక్కరే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. కరోనా అనేది జబ్బు కాదు పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై కన్నా స్పందించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారన్నారు.

దురదృష్టం ఏంటంటే.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం కరోనా అనేది జబ్బు కాదు పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బని అంటున్నారన్నారు. దాన్ని కారణంగా చూపించి ఎన్నికలు వాయిదా వేయమేంటని అంటున్నారు’ అని విమర్శించారు.ఎన్నికలపై ఈసీ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ స్వాగతిస్తోంది. ఈ రాష్ట్రంలో అప్రజామ్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని మేము మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.

Related posts