ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని ఆయన అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడతూ యూదుల మీద హిట్లర్ ఎలా కక్షగట్టాడో, ఆంధ్రప్రదేశ్లో కమ్మల మీద మన నయా హిట్లర్ జగన్ అలా కక్ష గట్టాడని ఆరోపించారు.
‘కరోనా’కు పారాసిటిమల్ వాడాలని ఏపీ సీఎం జగన్ చెప్పారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంటే సీఎం జగన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ముందు జాగ్రత్తగా ఏంచేయాలో చెప్పాలిగానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదు’ అని బుచ్చయ్య విమర్శలు గుప్పించారు. 9 రాష్ట్రాల్లో ఇప్పటికే కాలేజీలు, బడులు మూసేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మనమందరం కృషి చేద్దామని పేర్కొన్నారు.