ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2”. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్ కి సంబంధించిన అప్ డేట్స్ ఏవీ బయటకు రాకపోవడంతో ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది ఫిలిం నగర్లో. ఇంకా దర్శక నిర్మాతల మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే వార్తలు కూడా వచ్చాయి.
కానీ చిత్రం ఆగిపోవడానికి అసలు కారణం ఏంటంటే… ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీకి దిగుతున్నారు. ప్రస్తుతం కమల్ తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో ఎన్నికలు ముగిశాక షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఆ తరువాతనే 3వ షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుందన్నమాట.
నా కాపురంలో ఇప్పులు పోశాడు… ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి : సింగర్ ఫైర్