telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బాహుబలి” రికార్డులను బద్ధలు కొట్టిన “అలా వైకుంఠపురములో” 

Ay

సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం “అల వైకుంఠ‌పుర‌ములో”. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంలో సుశాంత్‌, న‌వదీప్, టబు ముఖ్య పాత్ర‌లు పోషించారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా వచ్చి మూడు వారాలు పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడో ఆదివారం (22 రోజులు) ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తాజాగా నైజాంలో ‘బాహుబలి: ది బిగినింగ్’ రికార్డును కొల్లగొట్టింది. నైజాంలో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రాల్లో ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ తరవాత ‘బాహుబలి 1’ ఉంది. ఇప్పుడు రెండో స్థానాన్ని ‘అల వైకుంఠపురములో’ ఆక్రమించింది. 22 రోజుల్లో నైజాంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా వసూలు చేసిన మొత్తం షేర్ రూ.39.18 కోట్లు. జీఎస్టీ కింద పోయినదానితో కలుపుకుంటే మొత్తం షేర్ రూ. 43.88 కోట్లు. ‘బాహుబలి 1’కి నైజాంలో వచ్చిన షేర్ రూ.42.70 కోట్లు.

మొత్తం మీద నైజాంలో అత్యధిక షేర్ వసూలు చేసిన టాప్ 5 చిత్రాలు వరుసగా ‘బాహుబలి 2’, ‘అల వైకుంఠపురములో’, ‘బాహుబలి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సైరా నరసింహారెడ్డి’. కేవలం నైజాంలోనే కాదు ఉత్తరాంధ్రలోనూ ‘అల వైకుంఠపురములో’ మంచి వసూళ్లను రాబడుతోంది. 22 రోజుల్లో ఈ చిత్రం ఉత్తరాంధ్రలో రూ. 19.10 కోట్ల షేర్ వసూలు చేసింది. జీఎస్టీతో కలుపుకుంటే షేర్ మొత్తం రూ. 21.39 కోట్లు. అంటే, ఉత్తరాంధ్రలోనూ రెండో స్థానం ‘అల వైకుంఠపురములో’ సినిమాదే. ఇక్కడ మూడో స్థానంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా ‘సైరా నరసింహారెడ్డి’, ‘రంగస్థలం’ చిత్రాలు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల్లో ప్రాంతాల వారీగా… :

నైజాం – రూ. 43.88 కోట్లు
సీడెడ్ – రూ. 18.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 21.39 కోట్లు
గుంటూరు – రూ. 10.46 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 11.25 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 8.40 కోట్లు
కృష్ణా – రూ. 10.22 కోట్లు
నెల్లూరు – రూ. 4.20 కోట్లు
ఏపీ, టీఎస్ మొత్తం – రూ. 128.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 12 కోట్లు
ఓవర్సీస్ – రూ. 17.80 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ – రూ.158 కోట్లు

Related posts