భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం దాదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. తనకు చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. చికిత్స అనంతరం తాను పూర్తిగా బాగున్నానంటూ గంగూలీ మీడియాకు వెల్లడించారు. కాగా, ఆయన నిన్ననే డిశ్చార్జి కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయనను వైద్యులు డిశ్చార్చి చేయలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నేటి నుంచి గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఆయన ఇంట్లోనే వైద్యులు పర్యవేక్షించనున్నారు. గంగూలీ కోలుకోవాలంటూ అంతకుముందు రాజకీయ నేతలు, టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులు ట్విట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాదా రాకతో మళ్ళీ బీసీసీఐ లో కొత్త ఉత్సహం వచ్చింది అనేది అయితే నిజం.
previous post
next post