telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏ దారి లేకే చంద్రబాబు మత రాజకీయం చేస్తున్నారు

shanker narayana

ప్రస్తుతం ఏపీలో వరుసగా ఆలయాల పై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ దారి లేకే చంద్రబాబు మత రాజకీయం చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల నుంచి పక్క దారి పట్టించేందుకే ప్రతిపక్షాల ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉన్న సీఎంను క్రైస్తవుడంటూ ఓ మతాన్ని ఆపాదించడం దిగజారడమేనని… శిధిలమైన గుళ్లను బాగు చేయడం ప్రభుత్వ విధానమన్నారు. దాంట్లో భాగంగానే దేవాలయాల పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. వైసీపీ-టీడీపీ కుమ్మక్కయ్యాయని బీజేపీ అనడం హస్యాస్పదమని… బీజేపీ పిలుపిచ్చిన ఛలో రామతీర్ధం కార్యక్రమంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకునే పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన అంశాలను రాజకీయం చేయడం ద్వారా ప్రతిపక్షాలు లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు మంత్రి శంకర్‌ నారాయణ. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts