కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకొంది. ‘కరోనా’ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయినపట్టికీ రంజాన్ మాసం కావడంతో మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే వారికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
మసీదుల్లో శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రార్థనల నిమిత్తం వచ్చే వారు ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. మసీదుల పరిసరాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని ఆదేశించింది.