telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: దేవినేని

devineni on power supply

వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ, వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు మధ్య అనుసంధానకర్తలుగా వారు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దశాబ్దాలుగా పని చేస్తున్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.

వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల జీతాలను ప్రజలపై రుద్దారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలనే ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. టీడీపీకి మద్దతుగా ఉండేవారి సంక్షేమాన్ని అడ్డుకోవడంవాలంటీర్ల లక్ష్యమని దుయ్యబట్టారు. వైసీపీ కోసం వాళ్లు పనిచేస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ల పంపిణీ తప్ప ఈ వ్యవస్థ ఏం చేస్తుందో చెప్పండి జగన్ గారూ అని ప్రశ్నించారు.

Related posts