telugu navyamedia
సినిమా వార్తలు

బసవతారకం ఆసుపత్రి 19వ వార్షికోత్సవ వేడుకల్లో బాలయ్య

Balakrishna

ఈరోజుతో హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రి 19 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో “బసవతారకం ఆసుపత్రి 19వ వార్షికోత్సవ వేడుకలు” నిర్వహించారు. ఈ వేడుకల్లో హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా తల్లిదండ్రులు ఎన్టీఆర్-బసవతారకం విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు బాలకృష్ణ. అనంతరం టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీ రామారావు, బసవతారకం కుమారుడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని, ఈ ఆసుపత్రి ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో మంది శ్రమించారని, కేన్సర్ అన్నది ఓ విచిత్రమైన వ్యాధి అనీ, అది రాకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచించారు. ఆసుపత్రిని అద్భుతంగా నడిపిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు కేన్సర్ రోగులకు బసవతారకం ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స అందజేస్తున్నామని తెలిపారు బాలకృష్ణ.

Related posts