భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్ ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది జరగబోవు టెస్టు సిరీస్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ మళ్లీ జట్టులోకి రావడంతో ఆస్ట్రేలియా బలోపేతమైంది. కాబట్టి.. ఈ సారి సిరీస్ భిన్నంగా ఉండబోతోంది. ఒక జట్టుగా టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందనడటంలో ఎలాంటి సందేహం లేదు. బౌలర్లు, బ్యాట్స్మెన్లు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నేను కూడా వ్యక్తిగతంగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సిరీస్ భలే మజాగా ఉండబోతోంది అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్లో ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్టుల్లోనూ ఓపెనర్ అవతారమెత్తి సెంచరీ, డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో.. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్గా మారిపోయిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా గడ్డపైనా అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తున్నాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
previous post