సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ లుక్ రిలీజ్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయిన చిత్రయూనిట్.. నటీనటుల ఎంపిక విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటోందట. ఇటీవలే మహేష్ సరసన నటించే హీరోయిన్గా కీర్తి సురేష్ని ఫైనల్ చేసిన డైరెక్టర్.. ఇక విలన్ రోల్ కోసం పవర్ఫుల్ యాక్టర్ని వెతికేపనిలో పడ్డారు. మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ రోల్ కోసం ముందుగా ఉపేంద్ర, సుదీప్ లాంటి నటులను పరిశీలించిన పరశురామ్.. ఫైనల్గా అరవింద్ స్వామి అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అరవింద్ స్వామితో సంప్రదింపుల కార్యక్రమం నడుస్తోందని సమాచారం.
previous post
అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు