telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Avengers

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెండి తెరపై సృష్టించిన అద్భుతం “అవ‌తార్”. 2009లో సామ్ వార్తింగ్టన్, జోయే సల్దనాతోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో వచ్చిన అవతార్ అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డులు సాధించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలోకి “అవతార్” సినిమా సీక్వెల్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అవతార్‌ 2, అవతార్‌ 3, అవతార్ 4, అవ‌తార్ 5’ చిత్రాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌నుకున్న కామెరూన్ ప్ర‌స్తుతం అవతార్‌ 2, అవతార్ 3 చిత్రాల‌కి సంబంధించి షూటింగ్ జ‌రుపుతున్నాడు. అవతార్ 2 చిత్రం డిసెంబ‌ర్ 17, 2021న విడుద‌ల కానుంది. అయితే ఈ ఏడాది విడుదలైన మార్వెల్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వసూళ్ల పరంగా అగ్రస్థానంలో ఉన్న అవతార్ రికార్డుల్ని సైతం అవెంజర్స్ ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. అవెంజర్స్ గురించి జేమ్స్ కామెరూన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ “ప్రస్తుతం నేను భారీ స్థాయిలో అవతార్ 2, 3 చిత్రాలని తెరకెక్కిస్తున్నా. ఎంతో కాష్టపడి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాల విషయంలో నాకు భయం కలిగింది. భవిష్యత్తులో ప్రజలకు నా సినిమాలు చేరువవుతాయా అనే అనుమానం కలిగింది. భవిష్యత్తులో ప్రజలు థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే పరిస్థితి ఉండదని భయపడేవాడిని. నా భయాన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం తొలగించింది. అందుకు నిదర్శనం ఆ చిత్రం సాధించిన విజయమే. అవెంజర్స్ చిత్రం తనకు అవతార్ 2, 3లపై నమ్మకాన్ని పెంచింది” అని కామెరూన్ అన్నారు.

Related posts