telugu navyamedia
రాజకీయ వార్తలు

ఓ మంచి మిత్రుడిని కోల్పోయాను.. జైట్లీ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి

narendra-modi

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయిన‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా జైట్లీతో త‌న‌కు ప‌రిచ‌యం ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. ప్ర‌తి అంశంపై జైట్లీకి ఎంతో ప‌రిజ్ఞానం ఉంద‌ని, అది అసాధార‌ణ‌మైంద‌ని మోదీ అన్నారు. ఆయ‌న మ‌న‌కు ఎన్నో జ్ఞాప‌కాల‌ను విడిచి వెళ్లార‌న్నారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు. బీజేపీలో అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత అని కితాబిచ్చారు.

దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేశారని చెప్పారు. విదేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడం, చట్టాలను తయారు చేయడంలో జైట్లీ సేవలందించారని తెలిపారు.ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు జైట్లీ ఎంతో కృషి చేశార‌న్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేశారని చెప్పారు. భారత రాజ్యాంగం, చరిత్ర, పబ్లిక్ పాలసీ, పాలనలో అమోఘమైన జ్ఞానం ఆయన సొంతమని చెప్పారు.

Related posts