telugu navyamedia
రాజకీయ వార్తలు

అరుణ్ జైట్లీ కన్నుమూత..శోకసంద్రంలో బీజేపీ శ్రేణులు

arun jaitley

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క‌న్నుమూశారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది.

ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈనెల 9వ తేదీన జైట్లీ ఎయిమ్స్‌ హాస్ప‌ట‌ల్లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు.. జైట్లీకి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. మోదీ తొలి క్యాబినెట్‌లో జైట్లీ కీల‌క పాత్ర పోషించారు.

Related posts