రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సినీనటుడు సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి పై ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఆయనకు ప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బైక్తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు నటుడు సాయిధరమ్ తేజ్గా గుర్తించి మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పవన్కల్యాణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరికి వచ్చి.. సాయిధరమ్ తేజ్ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తేజ్ను అపోలో ఆస్పత్రికి తరలించారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అరవింద్, సందీప్ కిషన్ తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు.
రోహిత్ శర్మను ఔట్ చేయడం డ్రీం… : పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ నసీమ్ షా