telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో .. ఎర్రచందనం అక్రమ నిల్వలు…

ap task force searches in telangana for

ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణలో దాడులు చేశారు. తిరుమల అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను తెచ్చి అక్రమంగా నిల్వ ఉంచారన్న ఆరోపణలపై నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం, ఎన్మన్ బెట్ల గ్రామంలోని శేషయ్య అనే వ్యక్తి ఇంటిలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుసుకున్న ఏపీ టాస్క్‌ ఫోర్స్‌, తెలంగాణ పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో శేషయ్య ఇంటిలో 100కు పైగా దుంగలు పట్టుబడ్డాయి.

దీంతో ఆ ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. శేషయ్యను కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్ పై ఏపీకి తరలించి, కేసును లోతుగా విచారిస్తామని అన్నారు.a

Related posts