telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్‌కు భద్రత పెంపు

Nimmagadda ramesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం వైసీపీ నేతలు ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం భద్రత పెంచింది.

మరోవైపు ఎస్ఈసీ రమేశ్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసినట్టు జరుగుతున్నా ప్రచారంపై సీఎం జగన్, డీజీపీ సవాంగ్, ఐబీ చీఫ్ మనీష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని సృష్టించిన వారు ఎవరు? అన్న అంశాలపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న లేఖపై  దర్యాప్తు చేయనున్నారు. 

Related posts