telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సోషల్ మీడియాతో .. ఎన్నికల సంఘం భేటీ..! నియమాలు పాటించాలి..

ec meeting with social media

ఎన్నికల సంఘం సోషల్ మీడియా సంస్థలతో ఇవాళ భేటీ అయ్యింది. ఢిల్లీలో ఈ సమావేశం జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఎలాంటి నియమావళిని పాటించాలన్న అంశంపై సోషల్ మీడియా సంస్థలకు ఎన్నికల సంఘం సూచనలు చేయనుంది. నిజానికి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో.. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ ఆరోరా కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ లాంటి సంస్థల ప్రతినిధులతో ఈసీ భేటీ అయ్యింది.

Related posts