telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఐదురాష్ట్రాల బహిరంగ సభలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. !

  • ఐదురాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
  • పార్టీలు ఉనికిని కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతున్నాయి.
  • కొత్త పుంతలు తొక్కుతూ ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాయి.
  • బహిరంగ సభలు, ర్యాలీలు, సౌడ్స్, కట్ అవుట్స్ లేవు. దీంతో.. తెలియని లోటు కనిపిస్తుంది.

ఈ కరోనా పుణ్యమా అని ప్రచారంలో ఒకప్పటి కల కనిపించడం లేదు. వేల మంది జనాలు, కట్ అవుట్స్ లేవు
కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రచారం మొత్తం డిజిటల్ గానే జరుగుతుంది.
ఇంతకు ముందు ఇంటింటి ప్రచారంలో 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంచింది.

అయితే.. తాజాగా ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలలో వెయ్యి మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అనుమతించింది.
బహిరంగ సభలకు, ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంచింది. ఇండోర్​లో 500 మంది వ్యక్తులతో ఎన్నికల సభ నిర్వహించడానికి మినహాయింపు కల్పించింది.

మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కించనున్నారు.

Related posts