ఫేక్ న్యూస్ పై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పుకార్లు, తప్పుడు వార్తలు, వాస్తవాలు దాచి మభ్యపెట్టే వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా వ్యవహరించండి అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అసవరమైతే అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. పుకార్లు, తప్పుడు వార్తలు, వాస్తవాలు దాచి.. మభ్యపెట్టే వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా వ్యవహరించాలన్న ఆయన.. అరెస్ట్ చేయండి.. వాళ్లను జైలుకు పంనే అధికారం కూడా ఎస్పీలకు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు అని గుర్తుచేశారు. ఈ విషయంలో అవసరం అయితే అందరూ ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని సూచించిన సీఎం జగన్.. కరోనా కేసులు, మృతులపై ప్రతీ రోజూ అఫిషియల్ బులెటిన్ ఇస్తారు.. దాన్నే అందరూ తీసుకోవాలన్నారు. కోవిడ్ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజల్లో ఆందోళన ఇంకా తీవ్రం అవుతుందని.. కాబట్టి.. అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టదు అని అన్నారు.
previous post