బాలీవుడ్ ‘పింక్’కి తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ తో పవన్ కళ్యాణ్ మల్లి రీ ఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. ‘వకీల్ సాబ్’ విడుదలకు ముందు ఏర్పడిన పాజిటివ్ బజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించగలిగింది. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. పవన్ కమ్ బ్యాక్ కి సరైన సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తిరుపతిలో వకీల్ సాబ్ సినిమాకి సునీల్ ధియోధర్, ఇతర బిజెపి నేతలు వెళ్ళారు. సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్ళిన సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పవన్ కల్యాణ్ ను చూసి భయపడుతున్నారని, అందుకే వకీల్ సాబ్ ఫ్యాన్స్ షో ని అడ్డుకున్నారని అన్నారు. ఫ్యాన్ షో అడ్డుకున్న మీరు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా రియల్ పొలిటికల్ హీరో మోది, పవన్ కల్యాణ్ కలసి చేసే అవినీతి, కుటుంబ పాలన, బలవంతంగా మత మార్పిడులకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని ఎలా అపగలరు అని ఆయన ప్రశ్నించారు.
previous post