telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు…

ఏపీలో నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ మార్చి 10 వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 71 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. కార్పొరేషన్లలో 2204, మున్సిపాలిటీల్లో 1822 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 20,419 మంది పోలీసులతో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 70 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. రాత్రి 8 గంటలలోగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎస్ఈసి. అయితే ఏ ఎన్నికలకు సాధరణ ఎన్నికల మాదిరిగా ప్రచారం నిర్వహించాయి అన్ని పార్టీలు. అంతే కాకుండా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే చూడాలి మరి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారు అనేది ఈరోజు తెలియనుంది.

Related posts