ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై కేంద్రం ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీని కలవాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఠాకూర్ ఢిల్లీ బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి బెంచ్ తో ఠాకూర్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవలే ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన కొద్ది రోజుల్లోనే ఏపీ డీజీపీకి పిలుపురావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కపోతే ఏపీ డీజీపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఏపీ డీజీపీ కాన్వాయ్ లోనే కోట్లాది రూపాయలు తరలించారని సంబంధిత ఆధారాలను సిఈసీకీ అందజేశారు. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న క్రమంలో ఏపీ డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.