2020 లో నటుడు రజనీకాంత్ కొత్త పార్టీని ప్రారంభిస్తారని గాంధీ పేరవై అధ్యక్షుడు తమిళరువి మణియన్ తెలిపారు. స్థానిక పోయస్గార్డెన్లో ఉన్న ఇంట్లో రజనీకాంత్ను కలుసుకున్న తమిళరువి మణియన్ ఈనెల 12న పుట్టినరోజు జరుపుకోనున్న సూపర్స్టార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనతో మాట్లాడిన రజనీ రాజకీయాలకు సంబంధించిన అభిప్రాయాల గురించి ప్రస్తావించారని, అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాలు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఖర్చు అధికంగా ఉంటుందన్నారు.
ఇప్పటి పరిస్థితులలో రజనీకాంత్, కమల్హాసన్లు రాజకీయాల్లో కలసి పని చేయాలని వారి అభిమానులు, ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం గురించి ఆడిటర్ గురుమూర్తి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్ట రాదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అరెస్టు రాజకీయంగా భావించరాదని బీజేపీ పెద్దలు చెబుతున్నారని తెలిపిన మణియన్, రజనీకాంత్ వచ్చే ఏడాది రాజకీయపార్టీని ప్రారంభించే అవకాశాలు బాగా ఉన్నాయన్నారు.