టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు తోకముడిచి హైదరాబాదుకు పారిపోయారని ఎద్దేవా చేశారు.
జగన్ దమ్ము ఏమిటో సోనియాగాంధీని అడగాలని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేస్తారని తాము భావించామని… అయితే దానికి భిన్నంగా ఆయన జూమ్ లో జూమ్ డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట ప్రజలూ లేరు, ఎమ్మెల్యేలూ లేరని చెప్పారు.
మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజలంతా ఆమోదం తెలిపారని అన్నారు. జగన్ నిర్ణయాన్ని న్యాయస్థానం కూడా ఆశీర్వదిస్తుందని ఆశిస్తున్నట్టు రోజా తెలిపారు. అమరావతి రైతులు చంద్రబాబును నమ్ముకుంటే.. వారిని నట్టేట ముంచేశారని అన్నారు. లోకేశ్ ను సీఎం చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు బుర్ర పని చేయడం మానేసిందని అన్నారు.