అమరలైన పోలీసుల త్యాగాలు మరువలేనివని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జపుకుంటున్నామని తెలిపారు.
సాధారణ ప్రజలకు కూడా పోలీసుల గురించి తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు పోటీలు నిర్వహించామని చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ఇప్పటి వరకూ 2511 పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన 1,81,315 మంది విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమాలలో పాల్గొన్నారన్నారు.