వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి విజన్ ను అనుసరించి 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తూన్నట్లు అన్నారు వార్డు కార్యాలయాలను పది మంది వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం తో వార్డు పరిపాలన వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని తిరిగి ఫిర్యాదు దారుడికి సమాచారాన్ని అందించడం లక్ష్యంగా వార్డు వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. వార్డు స్థాయి లో వచ్చే తాగునీటి సమస్యలు, సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిటీజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అధికారులు పౌరుల సమస్యలను సావధానంగా విని దరఖాస్తులు సేకరించి అట్టి సమస్యల పరిష్కారానికి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు ప్రజల తో సానుకూల దృక్పథంతో, సహనంతో పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని తెలిపారు. వార్డు లెవెల్ అధికారులు కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ వార్డు పరిపాలన సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు.


జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ… పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను విస్తృతంగా పరిష్కరించడానికి వార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రతిరోజు సోషల్ మీడియా, వాట్సప్, హెల్ప్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే ఎప్పటికప్పు
ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ నిలుస్తావు.. పీవీపీపై బండ్ల గణేశ్ విమర్శలు