telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

లక్కీ ఛాన్స్ కొట్టేసిన గాలి సపంత్ హీరోయిన్…

క్రాక్ సినిమాతో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్‌మహరాజ రవితేజ తాజాగా ఖిలాడీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయన్‌లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేశారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన తర్వాతి సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉండగా… అందులో మొదటి హీరోయిన్ గా లవిలీ సింగ్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ భామ శ్రీ విష్ణు హీరోయిన్ గా నటించిన గాలి సపంత్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ వార్తలకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇక మే28న విడుదల కానున్న ఖిలాడీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related posts