telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో కరోనా బీభత్సం.. ఒకే కుటుంబంలో 21 మందికి పాజిటివ్‌

Covid-19

ఏపీలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ఏకంగా 21 మందికి కరోనా సోకింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే.. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరిని కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ గ్రామంలో శానిటైజేషన్‌ ను చేపట్టారు. కాగా….ఇప్పటికే ఏపీలో 8.95 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 758 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,95,879 కు చేరింది. ఇందులో 8,85,209 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3469 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,201 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

Related posts