ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అమరావతిలో భూఅక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్కు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
భోగాపురం ఎయిర్పోర్టు పనుల్లో జీఎమ్మార్కు ఇచ్చిన 2700 ఎకరాలు 2200కు కుదింపు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్ని నాని వెల్లడించారు. ఎన్నికల కోసం అసెంబ్లీ కూడా వాయిదా వేసుకున్నామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే రిజర్వేషన్లు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.