telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్న క్యాంటిన్ కార్మికులంతా ఐక్యం కావాలి: లోకేష్‌

Minister Lokesh comments YS Jagan

పేదల ఆకలి తీర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను ఇటీవల ఏపీ సర్కారు మూసివేసిన సంగతి తెలిసిందే. కేవలం రూ. 5 కే భోజనం సరఫరా చేసే ఈ క్యాంటీన్ లు మూతపడడంతో పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను నేడు అన్న క్యాంటీన్‌లలో పనిచేసిన కార్మికులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

అన్న క్యాంటిన్‌ల మూసివేతతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని లోకేష్‌కు అన్న క్యాంటీన్‌లలో పని చేసిన కార్మికులు విజ్ఞప్తి చేశారు. అన్న క్యాంటిన్ కార్మికులంతా ఐక్యం కావాలని ఈ సందర్భంగా లోకేష్ కార్మికులకు సూచించారు.

Related posts