telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కోవిడ్ సంరక్షణా కేంద్రానికి 2 కోట్ల విరాళం ఇచ్చిన అమితాబ్

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాంతో ఆ ఈ వైరస్ తో పోరాడటానికి చాలామంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అమితాబ్ కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పడనున్న కోవిడ్-19 సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్‌ మీడియాకు తెలిపారు. రాకబ్ గంజ్‌లో ఏర్పాటు చేసిన కొత్త కరోనా సంరక్షణ కేంద్రం నేడు ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 300 పడకలను ఏర్పాటు చేసినట్టు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మాటిచ్చారన్నారు.

Related posts