మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావళి సందర్బంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తరకెక్కుతుందని నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. డాన్శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. 2017 తర్వాత శృతిహాసన్ తెలుగులో నటిస్తున్న చిత్రమిది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన సూపర్హిట్ చిత్రం `బలుపు`లోనూ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. డాన్ శీను, బలుపు వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెఇది. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత తమిళంలో విజయ్ నటించిన ‘తెరి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై గో్పీచంద్ మలినేని వివరణ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నానని, రీమేక్ సినిమా చేయడం లేదని అన్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.