ఉత్తర ప్రదేశ్ లో జరిగిన దారుణ సంఘటన హాత్రాస్ బాలిక యువతి అత్యాచారం.. ఈ ఘటన జరిగి దాదాపు వారం అవుతుంది. అయిన అత్యాచారానికి పాల్పడిన మృగాలను మాత్రం పట్టుకోలేదు.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనను వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో బీజేపీ నేత సురేందర్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.అమ్మాయిని పద్ధతిగా పెంచాలని,అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ ఘటన పై స్పందించిన హీరోయిన్ కృతి సనన్ ఆయన పై తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు.అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంస్కారం నేర్పించాలా? చాలా గందరగోళంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుస్తుందా..ఇలాంటి ఆలోచన మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందు మీ కొడుకుల బుద్ది మారాలంటూ చెప్పింది.వారి బుద్దిని అలా చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు అంటూ కృతి ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఈ విషయం పై స్పందించిన పలువురు ఆమె పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది..