telugu navyamedia
సినిమా వార్తలు

రామారావు ఆన్ డ్యూటీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ ..

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ‘బుల్​ బుల్​ తరంగ్​’ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..’ అంటూ సాగే ఈ పాట‌ను సామ్ సిఎస్ కంపోజ్ చేయ‌గా సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. రాకెండు మౌలి లిరిక్స్​ అందించారు.

ఈ లవ్లీ రొమాంటిక్‌ మెలోడీలో రవితేజ, రజీషాల కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది.యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్‌ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించాడు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 17న గ్రాండ్​గా సినిమా రిలీజ్ కానుంది.

Related posts