telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : హైదరాబాద్ పేరిట మరో ఓటమి…

చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. కానీ ఆ జట్టు స్టార్ హిట్టర్ పొలార్డ్(35) తో అదరగొట్టడంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది ముంబై. ఇక 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్ల ఇద్దరు జట్టుకు ఈ ఐపీఎల్ లో మొదటి గెలుపు పైన నమ్మకాన్ని కల్పించారు. కానీ ఆ నమ్మకాన్ని తర్వాత వచ్చిన ఆటగాళ్లు నిలబెట్టలేక పోయారు. బెయిర్‌స్టో(43) ఔట్ అయిన తర్వాత స్లో అయిన హైదరాబాద్ మళ్ళీ రైజ్ కాలేదు. చివర్లో విజయ్ శంకర్(28)తో కొంత ఆశ కలిగించిన అది నిరాశగానే మిగిలిపోయింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టడంతో 19.4 ఓవర్లలోనే 137 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో 13 పరుగులతేడాతో ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని ముంబై నమోదు చేస్తే హైదరాబాద్ వరుసగా మూడో ఓటమి నమోదు చేసింది.

Related posts