ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలనుద్దేశించి ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు.
అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నజగన్ సర్కారు, మండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.