కశ్మీర్లో ని తాజా పరిణామాల పై ఆగ్ర రాజ్యం అమెరికా స్పందించింది. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. వైట్హౌస్ అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ మాట్లాడుతూ ఇరుదేశాలు శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. చర్చలకు అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
కశ్మీర్తో సంబంధం ఉన్న అన్నిభాగస్వామ్య పక్షాలు సమన్వయం పాటించాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాము గమనిస్తున్నామని తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ఇటీవల అమెరికా పర్యటించినప్పుడు కశ్మీర్ అంశమే ప్రధానంగా సాగలేదని, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. కశ్మీర్లో భారత్ మానవ హక్కు ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాకిస్థాన్ ఆరోపణలపై మోర్గాన్ స్పదించేందుకు నిరాకరించారు. త్వరలో అమెరికా ప్రతినిధి భారత్లో పర్యటిస్తారని అప్పుడు అంశాలు చర్చిస్తారని తెలిపారు.