అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూయార్క్లోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 60 మంది గాయపడినట్లు సమాచారం.
గాయపడ్డవారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ఫైర్ డిపార్ట్మెంట్ న్యూయార్క్ కమిషనర్ డేనియల్ నీగ్రో తెలిపారు. వీరిలో మరో 32 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్ నగరంలోని ది బ్రోంక్స్ బరోలో అపార్ట్మెంట్ భవనం లో రెండు, మూడో అంతస్తులకు మంటలు చెలరేగడంతో ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడం ప్రారంభించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిపోవడంతో అపార్ట్మెంట్ మొత్తం పొగతో కప్పుకుపోయింది.
దీంతో అపార్ట్మెంట్లో ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి..అస్వస్థతకు గురైయ్యారి .. అందుకే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.