గుజరాత్ లోని గ్యాస్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. వడోదరలోని పద్రా తాలుకాలో గల గ్యాస్ తయారీ పరిశ్రమలో ఈ ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.
ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వాయువులను కంపెనీ తయారు చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేటీఆర్ ‘చిలక’ తో పోల్చిన చార్మినార్ ఎమ్మెల్యే…