*అమాలపురం అల్లర్ల కేసులో వైసీసీ నేతలకు నోటీసులు
* వైసీపీ మంత్రి విశ్వరూప్ అనుచరలపై కేసు నమోదు..
*సత్యరుషి, వాసంశెట్టి సుభాష్ ,మట్టపర్తి మురళీకృష్ణ,
మట్టపర్తి రఘులను నిందులుగా చేర్చిన పోలీసులు
కోనసీమ అమలాపురం అల్లర్ల కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు చేశారు.
మంత్రి విశ్వరూప్ అనుచరులైన A-225గా సత్యరుషి, A-226గా వాసంశెట్టి సుభాష్ , A-227గా మట్టపర్తి మురళీకృష్ణ, A-228గా మట్టపర్తి రఘులను చేర్చారు. ఈ కేసులో A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు గత 24న అమలాపురంలో పెద్దయెత్తున అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని దుండగులు దగ్దం చేశారు.
ఈ అల్లర్లపై విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై కేసు నమోదు చేసి నిందితులుగా చేర్చారు.నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.