రానా దగ్గుబాటి సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం ‘విరాట పర్వం’. .నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ ఈ చిత్రం. 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో దీన్ని తెరకెక్కించారు.
నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా కనిపిస్తారు. ఆయన ప్రేయసి వెన్నెలగా సాయిపల్లవి నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘నగాదారిలో’, ‘చలో చలో’ అనే సాంగ్స్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. సాయిపల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అన్ని నిర్మాణ కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు.
హీరో సిద్ధార్థ్ పై నయనతార బాయ్ ఫ్రెండ్ అసహనం